పంజాబ్ లో స్వల్ప భూకంపం

Telugu Lo Computer
0


పంజాబ్‌లో స్వల్ప భూకంపం కంపించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో భటిండాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. బటిండాకు 231 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 92 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)