లోక్సభలో కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు దిగారు. బీజేపీ సర్కారు హామీలపై నామ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి లేక యువత ఆత్మహత్యలపై చర్చను కోరుతూ వాయిదా తీర్మానం నోటీసు అందజేశారు. దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. దేశ యువతను ఇబ్బoదులకి గురి చేసే కీలక అంశాలపై చర్చ జరపాలని నామ కోరారు. వాయిదా తీర్మానం నోటీస్పై చర్చకు అనుమతించక పోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
లోక్సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్
March 24, 2022
0