ఎదురు కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ మృతి

Telugu Lo Computer
0


ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు, డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ రితేష్ పూణేమ్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతిడిపై రూ.3 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైకా, మోస్లా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా సిబ్బందిని చూసి మావోయిస్టులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ రితేష్ పూణేమ్ మృతి చెందగా రామ్లు హేమ్లా అనే జవాన్ గాయపడ్డాడు. ఘటనా స్థలం నుంచి మావోలు ఉపయోగించిన ఒక ఆయుధం, పిస్టల్, మావోయిస్టుల మెటీరియల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)