కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలోవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ను 3శాతం పెంచినట్లు వెల్లడించింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ పెంపుదల వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మార్పులు జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తాయి. పెంపుదల ద్వారా 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాతే అమలవుతాయని ప్రకటించారు. “ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములాకు అనుగుణంగా ఉంది” అని పేర్కొంది. డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ రెండింటి ద్వారా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ.9వేల 544.50 కోట్లుగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ?
March 30, 2022
0