విద్యుత్తు ప్రమాదంలో ఆపరేటర్‌కు తీవ్రగాయాలు

Telugu Lo Computer
0


ఫ్యూజును సరిచేసేందుకు యత్నించిన ఆపరేటర్‌ విద్యుత్తు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన పాతర్లపహాడ్‌ 33/11కేవీ ఉపకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉపకేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న రామన్నగూడేనికి చెందిన గంధం రాజేష్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం త్రీఫేజ్‌ సరఫరాను బంద్‌ చేసి సింగిల్‌ఫేజ్‌ సరఫరా చేసేందుకు ఫ్యూజులు మార్చారు. సింగిల్‌ఫేజ్‌ విద్యుత్తు సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడింది. ఫ్యూజు పోయినట్లు గమనించిన రాజేష్‌రెడ్డి ఉపకేంద్రంలో ఏవీ స్విచ్‌ను బంద్‌ చేసి స్తంభం ఎక్కారు. అక్కడ ఏవీ స్విచ్‌ బంద్‌ చేసే సమయంలో నియంత్రికపై ఉన్న మూడు పత్తులు వేరు పడాల్సి ఉంది. మూడింటిలో ఒక్క పత్తి వేరుపడకపోవడంతో విద్యుత్తు ప్రసారం జరిగింది. దానిని గమనించక స్తంభంపైకి ఎక్కి ఫ్యూజు వేస్తుండగా విద్యుత్తు ప్రమాదం జరిగి రాజేష్‌రెడ్డి కాలు, చేతికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో సూర్యాపేట నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్తంభంపైనే వాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)