పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు !

Telugu Lo Computer
0


కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు కాగా, 15 డెమో రైళ్లు ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 55 ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాటిల్లో ప్రస్తుతం 23 రైళ్లను పునరుద్దరిస్తోంది. నడికుడి – మాచర్ల – నడికుడి (67279-80), గుంటూరు – తెనాలి – రేపల్లి (67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా.. కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ (57307-08) మార్చి 27వ తేదీన, నరసాపురం – భీమవరం – నరసాపురం (17264-63) మార్చి 28న ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)