చిరంజీవికి నితిన్ భార్య కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం?

Telugu Lo Computer
0


హీరో నితిన్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితురాలు షాలిని కందుకూరిని 2020 ఈ సంవత్సరం లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్నాడు.  శాలిని ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమె తల్లిదండ్రులు సంపత్ షేక్ అలాగే నూర్జహాన్ లది కూడా ప్రేమ పెళ్లి కావడం విశేషం. అదేవిధంగా వీరిద్దరూ కర్నూలు జిల్లాలో ఫేమస్ డాక్టర్లు.  గత 20 సంవత్సరాల నుంచి కర్నూలులో నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ డాక్టర్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత కర్నూలు నుంచి నూర్జహాన్ ను తన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ విధంగా ఎన్నికలలో పోటీ చేసిన ఈమె ఓటమి పాలవడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయినప్పటికీ వీరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూ వచ్చింది ఈ క్రమంలోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా శాలిని తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవికి ఎంతో సన్నిహితంగా కావడంతో షాలిని కూడా మెగా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంది. ఇక గత కొద్ది రోజుల క్రితం షాలిని కరోనా బారిన పడటంతో తనకు బయట నుంచి కేక్ కట్ చేస్తూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నితిన్ తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)