కుమారుడితో కలిసి తండ్రి బలన్మరణం!

Telugu Lo Computer
0


ముంబయి ఉల్హాస్‌నగర్‌లోని శాంతినగర్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ అందాలే బుధవారం సాయంత్రం 6 గంటలకు తన కుమారుడిని తీసుకుని విఠల్‌వాడి రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. కొద్దిసేపు ఫ్లాట్‌ఫామ్‌పై తనయుడితో కలిసి తిరిగాడు. అనంతరం కుమారుడి చేయి పట్టుకొని ముంబై నుంచి పూణె వెళ్తున్న దక్కన్ ఎక్స్‌ప్రెస్ ముందు పట్టాలపై దూకేశాడు. ఈ ఘటనలో రైలు కిందపడి ప్రమోద్ ప్రాణాలు కోల్పోగా పట్టాలకు పక్కనే పడిపోయిన అతడి ఆరేళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని ఇంటికి తరలించారు. ప్రమోద్‌ అత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)