ముంబయి ఉల్హాస్నగర్లోని శాంతినగర్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ అందాలే బుధవారం సాయంత్రం 6 గంటలకు తన కుమారుడిని తీసుకుని విఠల్వాడి రైల్వేస్టేషన్కు వెళ్లాడు. కొద్దిసేపు ఫ్లాట్ఫామ్పై తనయుడితో కలిసి తిరిగాడు. అనంతరం కుమారుడి చేయి పట్టుకొని ముంబై నుంచి పూణె వెళ్తున్న దక్కన్ ఎక్స్ప్రెస్ ముందు పట్టాలపై దూకేశాడు. ఈ ఘటనలో రైలు కిందపడి ప్రమోద్ ప్రాణాలు కోల్పోగా పట్టాలకు పక్కనే పడిపోయిన అతడి ఆరేళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని ఇంటికి తరలించారు. ప్రమోద్ అత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడితో కలిసి తండ్రి బలన్మరణం!
February 17, 2022
0