తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన లక్ష్మికి పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన శేరి రమేష్తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. తల్లి గారింటికి వెళ్లొస్తానని భర్తతో కలిసి లక్ష్మీ బుధవారం పరిగి వెళ్లింది. భర్త పరిగి బస్టాండ్లో వదిలి తాను డ్యూటీకి వెళ్లాడు. తన భార్య మోత్కూర్కు వెళ్లిందో లేదో అని ఫోన్ చేయగా ఫోన్ లిప్ట్ చేయలేదు. వెంటనే అత్తగారింటికి ఫోన్చేయగా అక్కడకి రాలేదని చెప్పారు. భర్త కంగారు పడుతుండగా లక్ష్మీ, తాను వేరే అబ్బాయిని ప్రేమించానని అతనితో కలిసి వెళ్లిపోతున్నానని భర్తకు మెసేజ్ చేసింది. ఈ మేరకు భర్త శేరి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు
పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి....!
February 24, 2022
0
Tags