ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తో ప్రభుత్వం తెలిపిన కర్ఫ్యూ ముగుస్తుండడంతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీవర్ సర్వేను కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
February 14, 2022
0