భారీగా పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలో రోజు రోజుకు మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 33,750 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 123 మంది బాధితులు చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,81,993 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 9249మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42 కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 145.68 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)