కూతుళ్ళే, కొడుకులై ...!

Telugu Lo Computer
0


ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణం మంగళాఘాట్‌ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది. ఆమెకి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్ళున్నారు. అందరికి పెళ్ళిళ్ళు చేసింది. ఆమె చనిపోయిందని తెలిసినా చివరి చూపు కోసం  కొడుకులు ఒక్కరు కూడా రాలేదు.. తోడబుట్టిన అన్నదమ్ములు తల్లి దహన సంస్కారాలకి రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ముందడుగు వేసి తమ తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.  వృద్ధ్యాప్యంలో అండగా ఉండాల్సిన ఆ ఇద్దరు కొడుకులు ఆలనాపాలనా పట్టించుకోవడమే మానేశారు. చివరికి ఆ తల్లి కన్నుమూసిందని తెలిసినా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమెను కడసారి చూసేందుకు కూడా రాలేదు. దీనితో ఆమె నలుగురు కుమార్తెలు సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకొని నాలుగు కిలోమీటర్ల మోసి అంత్యక్రియలు నిర్వహించి తల్లి రుణం తీర్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)