తిరుపతి తర్వాత ఆదాయానిచ్చే ధనిక దేవాలయాలు

Telugu Lo Computer
0


దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో తిరుపతిలోని వేంకటేశ్వరాలయం ఒకటి. ఈ క్షేత్రం ఖాతాలో 9 వేల కిలోల బంగారు కలిగి ఉంటుంది. వీటిలో 7235 కిలోల బంగారం దేశంలోని 2 బ్యాంకుల్లో, 1934 కిలోల బంగారం ట్రస్ట్‌లో డిపాజిట్ చేసింది. దేశంలో మొదటి అత్యంత ఆదాయాన్ని ఇచ్చే దేవాలయం తిరుపతి. పద్మనాభస్వామి ఆలయం: కేరళలోని తిరువనంతపురం ఆలయ సంపద ఓ వార్త పత్రిక నివేదిక ప్రకారం, ఇది $ 20 మిలియన్లు లేదా $ 1,48,681 కోట్ల నికర విలువతో దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఈ పద్మనాభ స్వామి ఆలయం కూడా పేరు ప్రసక్తిలు పొందింది. షిర్డీ సాయిబాబా ఆలయం: దేశంలోని ధనిక దేవాలయాలలో షిర్డీ సాయిబాబా ఆలయం మూడవది. ఆలయ బ్యాంకు ఖాతాలో 4428 బంగారం, వెండి, సుమారు రూ.1800 కోట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు 360 కోట్ల విరాళాలు అందుతాయి. దేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికి వస్తారు. వైష్ణో దేవి: వైష్ణో దేవి దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఇటీవలి నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 500 కోట్లకు పైగా విరాళాలు విరాళాల రూపంలో వస్తాయి. ఈ దేవాలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడతారు. ముంబై సిద్ధివినాయక దేవాలయం: ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఓ వార్త పత్రిక నివేదిక ప్రకారం ఆలయ వార్షిక సగటు ఆదాయం రూ.48 నుంచి 125 కోట్లు. కలకత్తాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ ఆలయానికి బంగారం ఎక్కువ మొత్తంలో విరాళంగా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)