ఉగాది కానుకగా ఆచార్య

Telugu Lo Computer
0


ఆచార్య చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటించగా, రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. రోజు రోజూకీ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంక్రాంతి రోజున ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)