ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు, సినీ తారలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం నారా లోకేష్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. '' నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నాకు లక్షణాలు లేకుండా కరోనా సోకింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాను. తనతో ఈ మధ్య కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలి' అంటూ ట్వీట్ చేశారు.
నారా లోకేష్ కు కరోనా పాజిటివ్
January 17, 2022
0
Tags