హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసుల విధులను అడ్డుకుంది. బ్రీత్ ఎనలైజర్కు ససేమీరా అంది. పోలీసులపైకి దూసుకెళ్లింది. అడ్డు వచ్చిన వారిని నెట్టేసింది. అరగంటపాటు రచ్చరచ్చ చేసింది. పోలీసులు ఓపికగా ఆమెను భరించారు. అయితే ఆమెతో పాటు స్నేహితుడు శ్వాసపరీక్షలకు ముందుకు రాలేదు. ఇక్కడ 30 కేసులు నమోదు చేశారు. గ్రీన్ బావర్చి వద్ద తనిఖీల్లో 12 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
Post a Comment
0Comments
3/related/default