కడప రిమ్స్‌లో కరోనా కలకలం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప రిమ్స్‌లో కరోనా కలకలం రేగింది. కడప రిమ్స్‌ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎన్టీఆర్‌ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. కళాశాలలో రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడగా, మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్‌ వర్సిటీని కోరింది. రేపు ఫైనల్‌ పరీక్షలు జరగనుండగా కొవిడ్‌ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)