మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మాదాపూర్‌లో లోటస్ బ్లిస్ స్పా పేరుతో దుర్గాసి సుజాత అనే మహిళ గత కొన్నాళ్లుగా స్పా నిర్వహిస్తోంది. ఇందులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు లోటస్ బ్లిస్ స్పాపై మంగళవారం దాడులు నిర్వహించి, నలుగురు యువతులను రక్షించారు. నిర్వహకురాలు దుర్గాసి సుజాత పరారీలో ఉండగా రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజకుమార్ పాటిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. దుర్గాసి సుజాతపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, ఎన్నో రోజులుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం

Post a Comment

0Comments

Post a Comment (0)