తెలంగాణ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం వెండికోల్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి భార్యభర్తలిద్దరూ చనిపోయారు. గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్లో తోటమాలిగా పనిచేస్తున్న శ్రీనివాస్ (46) తోటకు నీరు పెట్టేందుకు బోరు మోటర్ ఆన్ చేయగా అతనికి కరెంట్ షాక్ తగలింది. అతడు కేకలు వేయడంతో గమనించిన భార్య దేవి అతనిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇద్దరికీ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను కాపాడబోయి భార్య కూడా....!
December 19, 2021
0