కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. డీఏ ఎరియర్స్ చెల్లింపుల రూపంలో కొత్త సంవత్సరం ఆరంభానికి ముందే వారికి తీపి కబురు అందనుంది. కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఏ ఏరియర్లను క్రిస్మస్ కానుకగా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై క్రిస్మస్‌కు ముందే అంటే డిసెంబర్ 24వ తేదీన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా డియర్ నెస్ అలవెన్స్‌(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్‌(డీఆర్‌) చెల్లించేందుకు కేంద్రం ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)