చైనాలోని యునాన్ ప్రావిన్స్లోని కున్మింగ్ నుంచి లావోస్ రాజధాని వియంటియాన్కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు కావడం గమనార్హం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లావోస్ ప్రధాని థాంగ్లూన్ సిసోలిత్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లు. 2016లో నిర్మాణం ప్రారంభమైంది. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్మింగ్ను, వియంటియాన్ను కలుపుతుంది. సాధారణంగా లావోస్ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడానికి రెండు రోజులు పడుతుంది. ఈ రైలుతో ఆ సమయం మూడు గంటలకు పరిమితం కానుంది.
చైనా నుంచి లావోస్కు రైలు
December 04, 2021
0
Tags