నా బాడీని ఇంటికి చేర్చండి...!

Telugu Lo Computer
0


అస్సాంకు చెందిన రాకేష్ (25) అనే యువకుడు రెండు రోజుల క్రితం సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్ లోని ఎస్ఆర్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం లాడ్జి సిబ్బంది గది తలుపులు కొట్టగా ఎంతకూ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా కిటికీ గ్రిల్ కు ఉరివేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. తాను కొన్ని ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తన బాడీని తన స్వగ్రామానికి చేర్చాలని లేఖ రాసి పెట్టాడు. అతని వద్ద దొరికిన ఆధారాలతో మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)