మెంతులు,వాము,నల్ల జీలకర్ర మిశ్రమం - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


అధిక బరువు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, షుగర్ ఇవి చాలా మందికి వస్తున్నాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఔషధాన్ని మీ ఇంట్లో లభించే పదార్థాలతోనే తయారు చేసుకుని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల అనేక వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు. మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాముల మోతాదులో తీసుకొని వీటిని వేర్వేరుగా పెనంపై వేయించాలి. అనంతరం ఈ మూడింటిని కలపాలి. మిక్సీలో వేసి బాగా పట్టి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని గాలి చొరబడకుండా సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట భోజనం అనంతరం లేదా నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఆ నీటిలో కలిపి తాగేయాలి. ఇది తాగిన తరువాత వేటినీ తీసుకోరాదు. ఇలా 3 నెలల పాటు రోజూ క్రమం తప్పకుండా తాగాలి. బరువు తగ్గుతారు. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఎముకలు, కండరాలు, కీళ్లు దృఢంగా మారుతాయి. కొవ్వు కరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)