నోట్లో గంగాజలం పోసిన వెంటనే లేచి కూర్చున్న వృద్దుడు..!

Telugu Lo Computer
1

దేశ రాజధాని  ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో సతీశ్‌ భరద్వాజ్‌(62) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా అతడు కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. అయితే.. సోమవారం తెల్లవారు జామున అతడు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు కుటుంబసభ్యులకు తెలిపాయి. అతడి మరణాన్ని ఏకంగా 11 మంది వైద్యులు నిర్థారించడం గమనార్హం. దీంతో కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చితిపై సతీశ్ భరద్వాజ్ దేహాన్ని ఉంచారు. నిప్పంటిచడానికి ముందు అతడి నోట్లో గంగాజలాన్నిపోశారు. అంతే ఆ వృద్దుడిలో కదలిక వచ్చింది. వెంటనే కళ్లుతెరిచి మాట్లాడాడు. తొలుత అక్కడున్న వారంతా అవాక్కైయ్యారు. తేరుకుని వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని అద్భుతం అని అంటుండగా.. మరికొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలా జరిగిందని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

1Comments

Post a Comment