వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు : 9 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా తెలుగు వెలుగు బస్సు డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిని దగ్గర్లోని జాలర్లు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు. గాయపడిన మిగతా వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సు ప్రమాదం తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 9మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన జల్లేరు వాగులోబస్సు బోల్తా ఘటనలో మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. బస్సు బోల్తాకు గల కారణాలపై ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆరా తీశారు. సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి నాని అప్రమత్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)