బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ కానుక ప్రకటించింది. ఇవాళ 15 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఇవాళ ఆర్టీసీకి చెందిన ఏసీ, మెట్రో, డీలక్స్, ఆర్డినరీ.. ఇలా ఏ బస్సులోనూ చిన్నారులకు టికెట్ అవసరం లేదని సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు
చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ కానుక
November 14, 2021
0
Tags