తండ్రికి నిప్పంటించిన కొడుకు!

Telugu Lo Computer
0


హైదరాబాద్, గచ్చిబౌలిలో ఒక వ్యక్తి తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పటించి హత్యచేశాడు. పోలీసులు తేలిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న దుర్గారావు అనే వ్యక్తికి కుమారుడితో వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం దుర్గారావుపై దాడికి దిగిన కుమారుడు.. అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు ఆర్పిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గారావు బుధవారం మృతి చెందాడు. ఘటన విషయం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)