ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీవేది వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రికలో దేవాలయం భజనలలో శ్రీదేవి పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలు దేవాలయం గర్భగుడిలో కూడా కూర్చున్నారు. దీంతో దేవుడుకు వీపు చూపి కూర్చోవడంపై హిందుత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రచార పిచ్చిపై గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మందిపడుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రచార పిచ్చితో హిందుత్వాన్ని కించపరుస్తున్నారని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇన్ చార్జ్ దర్శనపు శ్రీనివాస్ అన్నారు. తక్షణమే ఉండవల్లి శ్రీదేవి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకాపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.