ప్రియునితో కలిసి కన్నతండ్రిని చంపిన మైనర్ బాలిక

Telugu Lo Computer
0


హైదరాబాద్‌, కుషాయిగూడలో ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్నతండ్రిని ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించిందో బాలిక. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. అనారోగ్యంతో కిందపడి చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్టులో రామకృష్ణను హత్య చేశారని తేలింది. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించిగా అసలు నిజం బయటపడింది. కన్న కూతురే.. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని రామకృష్ణను ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో‌ హత్య చేయించిందని తేలింది. నిందితుడు భూపాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలికను జువైనల్‌ హోంకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)