ప్రవాసాంధ్రులు ఎవరైనా సరే ఏడాదికి రూ. 550 చెల్లిస్తే రూ. 10 లక్షల భీమాను భోరోసా కపిస్తామని ఎపి ఎం ఆర్ టి అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రకటించారు. అంతేకాదు రూ. 550 ను మూడేళ్ళ పాటు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వలసలు వెళ్ళిన వారు దాదాపు 20 లక్షల పైనే ఉన్నారని, వీరందరూ ఈ భీమాను ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు. ఇది కేవలం ప్రవాసాంధ్రులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఇదిలావుంటే గడిచిన రెండేళ్ళలో సుమారు 1.5 కోట్ల మీద ప్రమాద భీమా డబ్బులు మరణించిన కుటుంబాలకు అందించామని ఆయన తెలిపారు. ప్రవాసులు ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి సమస్య వచ్చినా సరే 8632340678, 8500027678 టోల్ ఫ్రీ నెంబర్ లకు కాల్ చేయవచ్చునని తెలిపారు.
ప్రవాసాంధ్రులకు భీమా భోరోసా!
November 04, 2021
0