ఈటలకు బండి సంజయ్ సన్మానం

Telugu Lo Computer
0



మాజీ మంత్రి, బీజేపీ నేత, హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటెల రాజేందర్ ను ఆ పార్టీ స్టేట్ చీఫ్, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గురువారం ఘనంగా సన్మానించారు. ఎంఎల్ఏ గా గెలిచిన అనంతరం మొదటిసారిగా ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఈటెలకు సంజయ్ ఎదురెల్లి స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక అనుభవాల గురించి మాట్లాడుకున్నారు. ప్రచారంలో సవాల్ చేసిన విధంగా గెలిపించి, సీఎం కేసీఆర్ కు పరాభావం కలిగేలా ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆనందాన్ని పంచుకున్నారు. రాజేందర్ ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికైన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)