ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని వెస్ట్ మాంబళంలోని తన నివాసంలో బుధవారం ఉదయం కన్నుమూశారు. డ్యాన్సర్గా కెరీర్ను ప్రారంభించిన ఆయన కొరియోగ్రాఫర్గా ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం మాస్టర్ట్స్ డ్యాన్స్ ట్రూప్లలో పనిచేశాడు. సుమారు 800 చిత్రాల్లో డ్యాన్సర్గా చేశారు. 'కాదల్ దేశం' చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్గా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మమ్ముట్టి, మోహన్లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.