బెంగళూరులోనే అత్యధిక కొవిడ్‌ కేసులు

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బెంగళూరులోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 347 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎనిమిది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా బెంగళూరులో అత్యధికంగా 166 మందికి వైరస్‌ సోకింది. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా ఆరు జిల్లాల్లో 10-50 మధ్య నమోదయ్యారు. 255 మంది కోలుకున్నారు. పదిమంది మృతి చెందారు. బెంగళూరులో నలుగురు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందిన వారిలో ఉన్నారు. 30 జిల్లాల్లో 8,708 మంది చికిత్సలు పొందుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)