బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ

Telugu Lo Computer
0


చాలా కాలం తర్వాత హిందీలో రిలీజైన మాస్ మసాలా సినిమా కావడం.. నార్త్ మార్కెట్ అంతటా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం.. దీపావళి పండుగ టైంలో సినిమా రిలీజ్ కావడంతో సూర్యవంశీ వెండితెరల్లో వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2, ఎవెంజర్స్-ఎండ్ గేమ్ సినిమాల రికార్డులను అది బద్దలు కొట్టింది. పీక్ టైంలో బుక్ మై షోలో సూర్యవంశీ సినిమాకు సంబంధించి సెకనుకు 17 టికెట్లు అమ్ముడయ్యాయట. ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్‌లో ఏ సినిమాకూ ఈ ఫ్రీక్వెన్సీలో టికెట్లు అమ్ముడవ్వలేదట. బాహుబలి-2, ఎవెంజర్స్ సినిమాలకు సంబంధించి సెకనుకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలియదు కానీ.. వాటిని అధిగమించి సూర్యవంశీ టికెట్ల అమ్మకాల్లో రికార్డు నెలకొల్పినట్లు బుక్ మై షో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఈ గణాంకాల్ని బట్టి సూర్యవంశీ హిందీ ప్రేక్షకుల్లో బాగానే వేడి పుట్టించిందని అర్థమవుతోంది. ఇక మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు వసూళ్ల విషయంలో ఢోకా లేదు. ఇండియాలో తొలి వీకెండ్లోనే ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అక్షయ్ సినిమా బాగానే సందడి చేస్తోంది. ఇప్పటిదాకా రూ.35 కోట్ల దాకా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈజీగానే అందుకునేలా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)