ఈపీఎఫ్‌వో ఎక్స్‌గ్రేషియా ఎనిమిది లక్షలకు పెంపు!

Telugu Lo Computer
0


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్స్‌గ్రేషియాను డబుల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎక్స్‌గ్రేషియా డెత్ రిలీఫ్ ఫండ్‌ను రూ.4.2 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఉద్యోగులు చనిపోతే ఈ డబ్బును వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులను ప్రతి మూడేళ్లకు ఒకసారి 10 శాతం చొప్పున పెంచుతారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన దాదాపు 30 వేల మందికి పైగా బెనిఫిట్ కలగనుంది. అదే విధంగా ఈపీఎఫ్‌వో ఇటీవలనే పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ  వేసిన సంగతి అందరికీ తెలిసినదే.

Post a Comment

0Comments

Post a Comment (0)