డీజే సౌండ్‌కు కోళ్ల మృతి !

Telugu Lo Computer
0

 


ఒడిషాలోని బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. సరైన ఉద్యోగం దొరక్కపోవటంతో రూ.2లక్షల బ్యాంకు లోన్ తీసుకుని కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి కోళ్లఫారం పక్కన ఉన్న ఇంటిలో పెళ్లి జరిగింది. రాత్రి గం.11-30 సమయంలో పెళ్లి వారింట్లో చెవులకు చిల్లలు పడేలా డీజే సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వైపు పెళ్లి జరుగుతోంది. మరోవైపు డీజే హోరులో ఆప్రాంతమంతా మారుమోగి పోతోంది. డీజే సౌండ్ కి పక్కనే ఉన్న కోళ్లఫారంలోని కొన్ని కోళ్లు తట్టుకోలేక పోయాయి. అవి అటూ ఇటూ కొట్టుకుంటూ కింద పడిపోయాయి. అది గమనించిన రంజిత్ వెంటనే పెళ్లి వారింటికి వెళ్లి డీజే సౌండ్ తగ్గించుకోమని కోరాడు. అయినా వారు వినలేదు. డీజే ఆపే లోపల కోళ్లఫారంలోని 63 కోళ్లు గిలగిల కొట్టుకుని మృత్యువాత పడ్డాయి. మరణించిన కోళ్లను మర్నాడు వెటర్నరీ డాక్టర్ కు చూపించగా అవి అన్నీ గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్ తెలిపారు. తన కోళ్ల చావుకు డీజేనే కారణమని రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)