బావను చంపిన బావమర్దులు

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం వెంగలయదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బావ సుంకన్నను సొంత బావమర్దులే రోకలి, వేట కొడవళ్ళతో దారుణంగా హతమార్చారు. వారం రోజుల క్రితం భార్య నరాయనమ్మ భర్త సుంకన్నతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. నిన్న రాత్రి ఇంటికి రమ్మని భార్యతో గొడవ పడుతుండగా బావమర్దులు ఘర్షణకు దిగి సుంకన్నను ఊరి చివరకు తీసుకెళ్లి తీవ్రంగా గాయపర్చారు. వెంటనే అతడిని ఆదోని ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆసుపత్రిలో సుంకన్న మృతదేహాన్ని బంధువులు వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన వెంటనే నిందితులను అదుపులో తీసుకుంటామని సీఐ ఈశ్వరయ్య తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)