ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తిరుపతి కోడూరు మార్గంలోని కరకంబాడి వద్ద వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి, పీలేరు, మార్గంలోనూ స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.