మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలోని దక్షిణ్ కరౌండియాలో నివాసముంటున్న ఒకరికి సంజయ్ సాకేత్ (26), రంజన్ (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి చెప్పుల దుకాణం ఉంది. ఆదివారం సాయంత్రం వాళ్ల తండ్రి దుకాణానికి వచ్చాడు. తండ్రి రాకను గమనించి పెద్ద కుమారుడు సాకేత్ కుర్చీ ఇచ్చి కూర్చోమన్నాడు. రంజన్ తన పని తాను చేసుకుంటున్నాడు. సాకేత్ తో తండ్రి గొడవపెట్టుకున్నాడు. అది కాస్త పెద్దిదిగా కావడంతో.. సాకేత్ చేతిలోని చెప్పులు కుట్టే సూది, కత్తెర తీసుకొని తండ్రి అతడి కడుపులో పొడిచేశాడు. అన్నను తండ్రి పొడవడం చూసి రంజన్ షాక్కు గురయ్యాడు. సోదరుడిని కాపాడటానికి ప్రయత్నించగా రంజన్ను కూడా తండ్రి కత్తెరతో పొడిచాడు. కుమారులిద్దరు రక్తపు మడుగుల్లో పడి గిలగిల్లాడడం చూసి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రాణాలతో ఉన్న రంజన్కు జిల్లా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పారిపోయిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment
0Comments
3/related/default