అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి

Telugu Lo Computer
0


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  తాజాగా జరిగిన ఓ ప్రముఖ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అవార్డులు అందివ్వాలన్న కోరిక మనసులో బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం అన్నారు. నిజంగా సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సహాన్ని ఇచ్చే వేడుక. నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి. ఇక నుండైనా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)