భర్త కూలీ అని....!

Telugu Lo Computer
0


కర్ణాటకకు చెందిన రాజేశ్వరి, వెంకటేశ్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరికి భర్త కూలీ పని చేస్తున్నాడని నామోషిగా ఫీలయింది. దీంతో తనకు పరిచయమైన హెడ్ కానిస్టేబుల్ అనంతకుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రాజేశ్వరి భర్తకు తెలియకుండా కాపురమే నడిపించ సాగింది. కొన్ని నెలల తరువాత ఈ విషయం భర్తకు తెలియడంతో హెచ్చరించాడు. మరోసారి ఇలాంటి సంబంధం పెట్టుకుంటే బాగుండదని వారించాడు. కానీ రాజేశ్వరి మాత్రం భర్త మాట వినకుండా అనంతకుమార్ తో చెట్టప్టాలేసుకొని తిరిగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరి-అనంతకుమార్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదిగా మారడంతో రాజేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. అయితే తన భార్య మరణానికి అనంతకుమార్ కారణమని రాజేశ్వరి భర్త పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనంతకుమార్ కోసం గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)