హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ నగరంలో ఇటీవలే ఒక కారులో భార్యభర్తలిద్దరు ప్రయాణిస్తుండగా వారికి అనుకోని సంఘటన ఎదురైంది. వారు రాజస్థాన్లోని తమ ఇంటికి వెళుతుండగా మార్గంలో భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ భర్త ఆ రాత్రికి రోహ్ తక్లోనే ఏదైనా హోటల్లో బసచేయాలనుకున్నారు. అలా దారిలో ఒక రోహ్ తక్ నగరంలోని సిటీ పార్కు వద్దనున్న ఒక హోటల్కు తీసుకెళ్లాడు. హోటల్ బయట కారును ఆపి భార్యను లోపలే ఉండమని చెప్పి అక్కడ గదులు ఖాళీగా ఉన్నాయో? లేవో? తెలుసుకుందామని వెళ్లాడు. ఆ వ్యక్తి భార్య కారులో ఒంటరిగా ఉండగా.. అప్పుడే అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను భయపెట్టి కారు తీసుకొని పారారయ్యాడు. భార్యభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కారు దొంగతనం కేసు నమోదు చేసి దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.