రిక్షావాడికి ఆస్తిని దానం చేసిన మహిళ

Telugu Lo Computer
0


ఒడిశాలో నివసించే 63 ఏళ్ల మినతి పట్నాయక్ తన కోటి రూపాయల విలువైన ఆస్తిని తనకు ఏ సంబంధం లేని ఓ రిక్షావాడి అతనికి రాసిచ్చేసింది. ఈ పనిని విన్నవారు ఆశ్చర్యపోవడంతో పాటు తన గొప్ప మనసుని ప్రశంసిస్తున్నారు. గతేడాది మినతి భర్త చనిపోయారు. ఇక మిగిలిన జీవితమంతా కూతురితోనే గడపాలి అనుకున్న మినతికి ఆ సంతోషం కూడా మిగలలేదు. తన భర్త చనిపోయిన ఆరు నెలల తర్వాత మినతి కూతురు కూడా గుండెపోటుతో మరణించింది. దీంతో తన జీవితం చీకటైపోయింది. అప్పటివరకు తనను పట్టించుకోని బంధువులు కూడా తన ఆస్తి కోసం దగ్గరవ్వడం మొదలుపెట్టారు. తన బంధువులు ఎవరికీ తన ఆస్తిని పంచడం ఇష్టం లేని మినతి తన కూతురిని 25 ఏళ్లు రిక్షాలో స్కూలుకు, కాలేజీకి తీసుకెళ్లిన సామల్‌ను పిలిపించింది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సామల్ పేరు మీద రాసేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)