ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు

Telugu Lo Computer
0

 



ఊర్వశి రదాడియాకు గుజరాత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె పాటలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతుంటారు. ఆమె రీసెంట్ గా తులసి అనే అమ్మాయి పెండ్లిలో పాట పాడింది. కాగా ఆమె పాటకు ఫిదా అయిన వారంతా పాటలో మైమరిచి పోతున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కార్పెట్‌పై కూర్చొని పాట పాడుతున్న ఆమె వద్దకు వచ్చాడు. అయితే అతను చేతిలో ఓ బకెట్ పట్టుకుని వస్తుండటం ఇందులో కనిపిస్తుంది. ఇక ఇలా వస్తూనే అతను ఆమె మీద ఆ బకెట్ లో తీసుకొచ్చిన డబ్బులను గుమ్మరిస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఆనందంగా చప్పట్లు కొట్టడం కనిపిస్తుంది. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిమీద సింగర్ ఊర్వశి స్పందించారు. తన మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమకు అభినందనలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)