హైదరాబాద్ లో కోటి రూపాయలు పట్టివేత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నార్సింగి వద్ద కోటి రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. హవాలా మనీగా అనుమానిస్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్నారు. తమ వద్ద ఉన్న డబ్బు హ్యాకర్లకు ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నామని అనుమానితులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కోటి రూపాయలకు రెండు కోట్లు ఇస్తామని అనుమానితులు చెప్పారని సమాచారం. ఈ నగదుకు సంబంధించి ముగ్గురిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)