నా భర్తకు విడాకులిప్పించి, నన్ను మోసం చేశాడు..!

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి (26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే అవకాశాల కోసం తిరుగుతున్న ఆమెకు రహ్మత్‌నగర్‌ వీడియోగల్లీలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమాగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని, తన భర్తకు విడాకులిమ్మని ప్రసాద్ ఫోర్స్ చేసి ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. దీంతో ఆమె ప్రసాద్ మాయమాటలు నమ్మి భర్తకు విడాకులిచ్చింది. నాలుగేళ్లు సహజీవనం చేసిన తరువాత ప్రసాద్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)