ప్రావిడెంట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసులో ఈపీఎ్ఫవో రిటైర్డ్ అధికారి కొండపల్లి సత్యనారాయణ రావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఓ ప్రకటనలో తెలిపింది. కడప సబ్ రీజనల్ కార్యాలయంలో సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న సమయంలో రూ.1.64 కోట్ల ఈపీఎఫ్ నిధులను వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించారన్న ఆరోపణలతో 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆతర్వాత ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
పీఎఫ్ నిధుల మళ్లింపు కేసులో ఆస్తులు అటాచ్ !
November 23, 2021
0