దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన సందేశాన్ని పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నటుడు శుక్రవారం గుండె పోటుతో మరణించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ "ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది” అని తెలిపారు. అరెస్టయిన యువకుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పునీత్ ఆకస్మిక మరణానికి కర్ణాటక మొత్తం సంతాపం వ్యక్తం చేస్తుంటే, నిందితుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బీర్ బాటిల్తో అవమానకరమైన పోస్ట్ను అప్లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, ఆ వ్యక్తి బెంగళూరు నగర పోలీసులను ట్యాగ్ చేసి చేయడం గమనార్హం. ఈ పోస్ట్ గురించి పునీత్ అభిమానులు పోలిసుల దృష్టికి తేవడంతో వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. నెటిజన్ పోస్టుకు ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ పై అవమానకర పోస్ట్
November 03, 2021
0