మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్ ఉపసంహరించుకోవడంపైఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బిల్లుల ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. తిరుపతిలోని రాయలవారి చెరువు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా? అది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర. రైతుల పాదయాత్ర చూసి బిల్లులు ఉపసంహరించుకోలేదు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.
ఇది ఇంటర్వెల్ మాత్రమే!
November 22, 2021
0