తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సూర్యారావుపేట ఎస్ఐ భార్య అక్కడికక్కడే చనిపోగా, గాయాలతో ఎస్ఐ బయటపడ్డాడు. అన్నవరం పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. విజయవాడ పరిధిలోని సూర్యారావుపేట సీసీఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న కోడూరు సత్యనారాయణ కుటుంబం కలిసి అన్నవరం వెళ్లేందుకు కారులో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుతుండగా కుక్క అడ్డుగా రావడంతో దాన్ని తప్పించబోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎస్ సత్యానారాయణ భార్య సరోజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ఎస్ఐ సత్యనారాయణకు ముప్పు తప్పింది. ఆయనతో పాటు గాయపడిన ఇతర కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని దవాఖానకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ భార్య మృతి
November 14, 2021
0
Tags